Vishnukundins History in Telugu-Telangana History in Telugu

Vishnukundins History in Telugu


Historians believe that Vishnukundins was born in a fort area in the Amrabad Zone (present day Munnur) of Mahabubnagar District.

విష్ణుకుండినులు Vishnukundins

(క్రీ.శ 358 - క్రీ.శ 569)


విష్ణుకుండినుల 

వంశ స్థాపకుడు                     ఇంద్రవర్మ (మహారాజేంద్ర వర్మ) 

రాజధాని                                  - ఇంద్రపాల నగరం, కీసర, అమరపురం,                                                                                          దెందులూరు 

మతం                                     - వైదికమతం (వైష్ణవం) 

రాజభాష                                 - సంస్కృతం 

రాజలాంఛనం                           - పంజా ఎత్తిన సింహం 

చివరివాడు                               - మంచన భట్టారకుడు 

విష్ణుకుండినుల కులదైవం               - శ్రీపర్వతస్వామి (శ్రీశైల మల్లికార్జునుడు)

 వంశంలో గొప్పవాడు                   - రెండవ మాధవవర్మ

 ప్రత్యేకత                                   - నరమేధ యాగం / నరబలిని ప్రోత్సహించుట

శిల్పకళ                                    - గుహాలయాలు (ఉండవల్లి)


• విష్ణుకుండినులు తమను తాము అమరపురీశులు,శ్రీపర్వతస్వామి పాదానుధ్యానులుగా పిలుచుకున్నారు.


 వీరి నాణెములపై చిహ్నం - నంది


• విష్ణుకుండినుల స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆమ్రాబాద్ మండలంలోని (నేటి మున్నూరు) కోట ప్రాంతం అని చరిత్రకారులు భావిస్తున్నారు.


• విష్ణుకుండినుల రాజ్యవిస్తరణ ఆమ్రాబాద్ మండలంలోని మునులూరు (నేటి మున్ననూరు) కోట ప్రాంతం నుండి ప్రారంభం అయ్యింది.


 అక్కడికి దగ్గరిలో ప్రసిద్ధ ఉమామహేశ్వర క్షేత్రం ఉంది. ఆ ప్రాంతం తుమ్మెద మామిడి చెట్లకు పేరుగాంచింది. ఆ చెట్టు మామిడి కాయలను పగులగొడితే అందులో నుంచి తుమ్మెదలు వచ్చేవి. 


 విష్ణుకుండినులు సంస్కృతికరణలో భాగంగా వారి రాజధాని అయిన మామిడిపురం పేరును అమరపురంగా మార్చుకున్నారు.


 మామిడిని సంస్కృతంలో ఆమ్రం అని అంటారు


 విష్ణుకుండినుల మొదటి రాజధాని -అమరపురం /ఇంద్రపురం/ఇంద్రపాల నగరం  


• అమరపురం అనగా నేటి మహబూబ్ నగర్ జిల్లాలోని అమ్రాబాద్ మండల కేంద్రం.


 ఇంద్రపాలనగరం ప్రస్తుతం యాదాద్రి జిల్లా వలిగొండ మండలం తుమ్మలగూడెం శివారులో ఉంది.


• విష్ణుకుండినుల రెండవ రాజధాని - దెందులూరు (పశ్చిమగోదావరి జిల్లా)


 విష్ణుకుండినులు కాందార రాజుల నుంచి త్రికూటమలయ అనే బిరుదును పొందారు.


 విష్ణుకుండినుల గురించి వివరించే సమగ్ర శాసనం - తుమ్మలగూడెం శాసనం


• మొదటి తుమ్మలగూడెం శాసనం - 1వ గోవిందవర్మ


• రెండవ తుమ్మలగూడెం శాసనం - విక్రమేంద్ర భట్టారకుడు వేయించారు.


• వీరి రాజ్యాన్ని విష్ణుమూర్తి యొక్క కౌస్తుభంతో పోల్చారు. 


• వీరు 'హిరణ్యగర్బ' అనే యాగం చేసి బ్రాహ్మణుల, క్షత్రియుల తేజస్సు తెచ్చి పెట్టుకున్నారు.


• విష్ణుకుండీ అనుపదం వినుకొండకు సంస్కృతీకరణ పదం అని వివరించిన చరిత్రకారుడు - కిల్ హరన్ 


• విష్ణుకుండినులు వాకటకులకు సామంతులు



విష్ణుకుండినుల చరిత్ర ఆధారాలు Evidence of the history of Vishnukundins


శాసన ఆధారాలు



          శాసనం పేరు                           ప్రాంతం 

1.తుమ్మలగూడెం రాగిశాసనాలు-2 -వలిగొండ మండలం, యాదాద్రి జిల్లా 

2. చైతన్యపురి శిలాశాసనం - హైదరాబాద్ 

3. కీసరగుట్ట శిలాశాసనం - మేడ్చల్ జిల్లా

4. సలేశ్వరం శిలాశాసనం - అమ్రాబాద్,నాగర్ కర్నూల్ 

5. వేల్పూరు శిలాశాసనం - గుంటూరు జిల్లా

6. ఈపురు రాగి శాసనాలు-2 - గుంటూరు జిల్లా 

7. రామతీర్థం రాగి శాసనం - విశాఖపట్నం

8. చిక్కుళ్ళ రాగి శాసనం - తుని, తూ.గో 

9, తుండి రాగి శాసనం - తుని, తూ.గో

10. పాలమూరు రాగి శాసనాలు - తూ.గో జిల్లా

11. ఖానాపూర్ రాగి శాసనం - సతార (మహారాష్ట్ర )


సాహిత్య ఆధారాలు:


1. జనాశ్రయ ఛందోవిచ్ఛిత్తి

2. సేతుబంధ


విష్ణుకుండినుల రాజులు kings of Vishnukundins


ఇంద్రవర్మ (మహరాజేంద్రవర్మ) (క్రీ.శ. 358-370)


 ఇతని బిరుదు ప్రియపుత్రుడు

 ఇంద్రవర్మనే మహారాజేంద్రవర్మ అని కూడా పిలుస్తారు.

 విష్ణుకుండినుల పాలకులలో మొదటి వాడు ఇంద్రవర్మ. ఇతను రామతీర్థం శాసనం జారీచేసాడు.

ఇంద్రవర్మ నల్గొండ జిల్లా ఇంద్రపాలనగరం (తుమ్మలగూడెం) ను రాజధానిగా చేసుకొని పాలన సాగించాడు.



మొదటి మాధవవర్మ (క్రీ.శ. 370-398)


• ఇతని బిరుదు - విక్రమహేంద్ర 

 మొదటి మాధవవర్మ రాజధానిని వినుకొండ నుండి కీసరకు మార్చాడు.

 మొదటి మాధవవర్మ ఉండవల్లి, భైరవకోన, మొగల్రాజపురం గుహలను తొలిపించాడు.

 ఇతను వాకటకుల రాకుమార్తెను వివాహం చేసుకున్నాడు.

 ఇతను ఋషిక మండలంను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అప్పట్లో తెలంగాణ ప్రాంతాన్ని ఋషిక  మండలం అనేవారు.

• ఈ ఋషిక మండలం క్రింద వచ్చే ప్రాంతాలు ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు 


మొదటి గోవిందవర్మ


* ఇతని రాజధాని - ఇంద్రపాలనగరం

• విష్ణుకుండినుల తొలిరాజులలో అగ్రగణ్యుడు, గొప్పవాడు.

తుమ్మలగూడెం శాసనం, ఇంద్రపాలనగర శాసనం ను వేయించినది - మొదటి గోవిందవర్మ

 మొదటి గోవిందవర్మ వేసిన ఇంద్రపాలనగర తామ్రశాసనం తెలంగాణలో లభించిన తొలి సంస్కృత శాసనం

 మొదటి గోవిందవర్మ హైదరాబాద్ చైతన్యపురి లో మూసినది ఒడ్డున తన పేరుమీద గోవిందవిహారాన్ని నిర్మించి, చైతన్యపురి శాసనం (ప్రాకృతం) వేయించాడు.

 తెలంగాణలో తొలి ప్రాకృత శాసనం - చైతన్యపురి శాసనం

• విష్ణుకుండినుల వంశంలో బౌద్ధమతాన్ని ఆదరించిన ఏకైక చక్రవర్తి - మొదటి గోవిందవర్మ

 ఇతని భార్య పరమభట్టారిక బౌద్ధ భిక్షువులకోసం ఇంద్రపాల నగరంలో మహవిహారాన్ని నిర్మించింది.

• గోవిందవర్మ ఈ విహారానికి పేణ్కపర (ఎన్మదల) గ్రామంను దానం చేసాడు.

 పేణ్కపర గ్రామం ప్రస్తుతం యాదాద్రి జిల్లా మోత్కూర్ మండలంలో కలదు.

• తరువాతి కాలంలో రాజ్యానికి వచ్చిన విక్రయేంద్ర భట్టారక వర్మ పరమబట్టారిక నిర్మించిన విహారానికి ఇరుందెర అనే గ్రామాన్ని దానంగా ఇచ్చాడు.

• గోవిందవర్మ పల్లవులను ఓడించి గుండ్లకమ్మ నది వరకు తన రాజ్యాన్ని విస్తరింపచేసాడు.

 ఇతను 'స్వనయ భుజబలోత్సాహ ప్రభావానురాగ వ్యాప్తి స్వరాజ్యేన' అని చెప్పుకున్నాడు.



రెండవ మాధవవర్మ (క్రీ.శ.435-470)


 ఇతను విష్ణుకుండినుల రాజులందరిలో గొప్పవాడు. 

 ఇతని కాలాన్ని విష్ణుకుండినుల చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొంటారు.

 రాజధానిని ఇంద్రపాల నగరం నుండి దెందులూరికి మార్చాడు.

 శాసనాలు ఇతనిని 'బలసత్వ ధైర్యవిద్య వినయ సంపన్నుడు' గా పేర్కొన్నాయి.

• ఇతను ప్రక్కరాజ్యాలపై దండయాత్రలు చేసి విష్ణుకుండినుల సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు.

 ఇతను శాలంకాయనులు, ఆనందగోత్రికులను ఓడించి వేంగీ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు.

• పల్లవులను, వాకటకులను కూడా ఓడించాడు.

• ఇతని విజయాలను పురస్కరించుకొని ఇతను 11 అశ్వమేధయాగాలు, పురుషమేధం, 1000 క్రతువులు నిర్వహించాడు.

• ఇతడు దేశంలోనే మొదటి సారిగా నరమేదయాగం/ పురుషమేదయాగం చేసాడు.

• ఆంధ్రుల చరిత్రలో నరమేధయాగం (యాగంలో నరబలి) చేసిన ఒకే ఒక రాజవంశం - విష్ణుకుండినులు

 ఇతడు వైదికమతాన్ని ప్రోత్సహించాడు.

• 2వ మాధవవర్మ పాలనాకాలంలోనే మొఘల్ రాజపురం, ఉండవల్లి గుహలు అంతకు ముందున్న బౌద్ధ చిహ్నాలను కోల్పోయి హిందూ దేవాలయాల నివాసాలుగా మారాయి.

 ఇతను ఉండవల్లిలో బుద్ధుడి విగ్రహాన్ని పగలగొట్టించి,దాని స్థానంలో శయనిస్తున్న విష్ణుమూర్తి విగ్రహాన్ని చెక్కించాడు. ఇదే నేడు అనంతపద్మనాభస్వామి ఆలయం

 ఇతను ఉండవల్లి గుహలలో పూర్ణకుంభాన్ని చెక్కించాడు. 

 రెండవ మాధవవర్మ తెలంగాణలో నిర్మించిన ప్రముఖ దేవాలయాలు :

• కీసర - రామలింగేశ్వర ఆలయం 
• చెరువుగట్టు (నల్గొండ) - జడల రామలింగేశ్వరాలయం 
• షాద్ నగర్ (రంగారెడ్డి) - రామలింగేశ్వర ఆలయం 
• ఇంద్రపాలనగరం - అమరేశ్వరాలయం, మల్లిఖార్జునాలయం , రామేశ్వరాలయం 
• పులిగిళ్ళ (వలిగొండ) - రామలింగేశ్వరాలయం 

 రెండవ మాధవ వర్మ బిరుదులు :

• జనాశ్రయ 
త్రివరనగర భవనగత సుందరీ హృదయ నందన 
• ప్రార్దిక్షిణాపదాంభోనిధిరేవా సరిత్సలిలవలయ.

• రెండవ మాధవవర్మ అనేక యుద్ధాలు చేసి విజయం సాధించి ఒకొక్క విజయానికి గుర్తుగా కీసరగుట్ట పైన ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠచేసాడు.

 ఈయన విజయం సాధించిన ప్రతి చోట రామలింగేశ్వరాలయం కట్టించాడు. 

• మహారాష్ట్రలోని ఖానాపూర్ (సతార జిల్లా)లో రెండవ మాధవవర్మకు చెందిన రాగిశాసనం లభించింది.

• ఇతను వేయించిన శాసనాలు:

• ఈపురు శాసనం -1
• ఖానాపూర్ శాసనం
వేల్పూరు శాసనం

• వేల్పూరు శాసనం ప్రకారం ఇతను గణపతి (దంతముఖ స్వామి) ప్రతిష్ట చేసినట్లు తెలుస్తుంది.

• జనాశ్రయ ఛందోవిచ్చిత్తి అనే గ్రంథాన్ని రెండో మాధవవర్మ రచించినట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు. (దీనిని గుణస్వామి రాసాడని కొందరి అభిప్రాయం)

• జనాశ్రయ ఛంధోవిచ్చిత్తి తెలంగాణలో రచించబడ్డ మొట్ట మొదటి సంస్కృత లక్షణ గ్రంథం.


విక్రయేంద్రవర్మ:


• ఇంద్రపాలనగర శాసనం ప్రకారం ఇతని బిరుదులు

 పరమసొగతస్య (బుద్ధుడి అంతటి జ్ఞాని) 
 మహాకవి

• ఇతనికి విష్ణుకుండిన, వాకటక వంశద్వయాలంకార జన్మ అనే నామం కూడా ఉంది.


3వ మాధవవర్మ


ఇతని బిరుదులు :

• త్రికూట మలయాధిపతి • అలిసిత వివిధదివ్య

• ఈయన కందార వంశాన్ని (ఆనంద గోత్రిక) పూర్తిగా నిర్మూలించి త్రికూట మలయాధిపతి బిరుదును ధరించాడు.



విక్రయేంద్ర భట్టారక వర్మ (రెండవ విక్రయేంద్రవర్మ)


ఇతని బిరుదులు :

• సకల భువన రక్షాభరణైకాశ్రయ
• ఉత్తమాశ్రయుడు 

 ఇతడు వేయించిన శాసనాలు:

తుమ్మలగూడెం శాసనం-2 
తుండి శాసనం
చిక్కుళ్ళ తామ్రశాసనం 

బ్రాహ్మణులకు 'తుండి' అనే గ్రామాన్ని దానం చేశాడు. 


నాలుగవ మాధవ వర్మ: 




ఇతని శాసనాలు: పొలమూరు -2 • ఈపూరు -2


ఇంద్రభట్టారక వర్మ


 ఇతను కీసర సమీపంలో ఘటకేశ్వరం అనే ఘటికాస్థానాన్ని నెలకొల్పాడు.

• ఇతని కాలంలో ఘటికలు అని పిలువబడే వైదిక విద్యాలయాలు స్థాపించబడ్డాయి. వాటిల్లో వేదవిద్యలను భోదించేవారు


మంచ భట్టారకవర్మ


• విష్ణుకుండిన రాజులలో చివరివాడు - మంచభట్టారకుడు . 

 చివరి విష్ణుకుండిన రాజు మంచన భట్టారకుణ్ణి, పృధ్వీ మూలరాజు ఓడించి రాజ్యాన్ని ఆక్రమించినట్లు తండివాడ శాసనం తెలుపుతుంది.



విష్ణుకుండినుల పరిపాలన - సంస్కృతి Administration and Culture of Vishnukundins


• విష్ణుకుండినులు రాజ్యాన్ని రాష్ట్రాలుగా, విషయాలుగా విభజించారు.

• విష్ణుకుండినుల కాలంలో

      హస్తికోశ - గజదళాధిపతి
      వీరకోశ - పదాతిదళాదిపతి

ఇతర ఉద్యోగులు

రజ్జుక - భూములను తాడుతో కొలిచి ఆయకట్టును నిర్ణయించేవాడు.
ఫలదారుడు - పండిన పంటలో రాజ్యభాగాన్ని నిర్ణయించే అధికారి
సెట్టి - ప్రభుత్వానికి చెందాల్సిన ధాన్యాన్ని కొలిచేవాడు. 
అక్షపటలాధికృతుడు - ప్రభుత్వ పత్రాలు భద్రపరిచేవాడు.


ఆర్థిక పరిస్థితులు - వాణిజ్యం: 
Economic conditions and Trade in Vishnukundins

• విష్ణుకుండినుల కాలంలో గ్రామాలలో స్వయం సమృద్ధియైన న్యాయపాలన ఆర్థికవ్యవస్థ ఉండేది.

• వీరు వ్యవసాయ అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకున్నారు.

• వీరి కాలంలో తూర్పు ఆసియాదేశాలతో మరియు రోమ్, గ్రీస్ దేశాలతో విదేశీ వ్యాపారం జరిగింది.

 రెండో మాధవ వర్మకు త్రిసముద్రాధిపతి అనే బిరుదు ఉండటం వారి విదేశీ వాణిజ్య ప్రాముఖ్యాన్ని సూచిస్తున్నాయి. 


నాణేలు


 విష్ణుకుండినులు రాగి, ఇనుము లోహములతో నాణేలను ముద్రించేవారు.

• వీరి నాణెములపై శ్రీపర్వత అనే అక్షరాలు, శంఖం, సింహం గుర్తులను ముద్రించేవారు.

• విష్ణుకుండినుల రాజ్యంలో గవ్వలు కూడా ద్రవ్యంగా చెలామణి అయ్యాయని చైనా యాత్రికుడు ఫాహియాన్ పేర్కొన్నాడు.

 మరో చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్ ప్రకారం శ్రీపర్వతం మీద బంగారంతో చేసిన నిలువెత్తు బుద్ధ బంగారు విగ్రహాలు ఉండేవని పేర్కొన్నాడు. అయితే ఈ విగ్రహాలు మనకు అమరావతిలో లభించాయి.

• దీనిని బట్టి వీరికాలంలో కంసాలి వృత్తిపని వారు మంచి నైపుణ్యం కలవారని తెలుస్తుంది. కీసరగుట్టపై దొరికిన ఒక నశం డబ్బి (పోత ఇనుముతో మామిడి పిందె ఆకారంలో చేసినది - 7 సెం.మీ) ఇందుకు మరో నిదర్శనం.

• ఆలంపురం దగ్గరి కూడలి సంగమేశ్వరంలో జరిపిన త్రవ్వకాలలో రోమన్ చక్రవర్తి కాన్ స్టాంటిన్ (క్రీ.శ 306 - 337) కు చెందిన ఒక బంగారు నాణెం దొరికింది.



సాంఘిక పరిస్థితులు: Social Conditions in Vishnukundins


 వీరి కాలం నాటికి వర్ణవ్యవస్థ పూర్తిగా బలపడింది. 

 విష్ణుకుండినులు దానమానాదులచే అనురక్తమగు వర్ణాశ్రమం స్వజన పరిజనులైనవారు అని వారి శాసనాలలో ఉంది.

 మాధవ వర్మ తన తల్లిదండ్రుల పాదాలను నిరంతరం సేవించేవాడట. దీనిని బట్టి ఆనాటి ప్రజలు కూడా తల్లిదండ్రులు, పెద్దలపట్ల గౌరవంగా నడుచుకునే వారణ చెప్పవచ్చు.


న్యాయ పాలన Rule of Law in Vishnukundins


• విష్ణుకుండినులు న్యాయపాలనకు పేరుగాంచారు

• రెండవ మాధవవర్మ దివ్యాలు అనే న్యాయవిధులను కనిపెట్టాడు.

 చింతకాయలు అమ్ముకొనే ఒక స్త్రీ కొడుకు ఏమరుపాటున తన రథాన్ని పోనిచ్చి చంపిన తన కుమారునికి మాధవవర్మ ఉరిశిక్ష విధించాడు.




సాహిత్యం - మతం Literature and Religion of Vishnukundins


• సంస్కృతం ను అధికార భాషగా చేసుకొని పరిపాలించిన మొదటి రాజవంశం - విష్ణుకుండినులు

• అయితే విక్రమేంద్ర భట్టారకవర్మ వేయించిన చిక్కుళ్ళ తామ్రశాసనంలో విజయరాజ్య సంవత్సరంబుల్” అనే మొదటి తెలుగు వాక్యం లిఖించబడింది.

• కీసరగుట్టపై ఉన్న ఒక గుండుకు 'తొలుచువాండ్లు' అనే అచ్చతెలుగు పదం చెక్కబడింది.

• ఇంద్రభట్టారక వర్మ బిరుదు - ఘటికావస్త పుణ్యసంచయ

రెండవ మాధవ వర్మ బిరుదు - విద్య ద్విజగుడు విస్తావృద్ధ తపస్వి జనాశ్రచయ

 గోవింధ వర్మ - షడభిజ్ఞ అని ప్రఖ్యాతి చెందారు. 

 పై బిరుదులను బట్టి విష్ణుకుండిన రాజులందరు స్వయంగా కవిపండితులని, కవి పండిత పోషకులని తెలుస్తుంది.


మత పరిస్తితులు 



వైదికమతం

• విష్ణుకుండినులు వైదిక మతాభిమానులు

• వీరి కులదైవం - శ్రీ పర్వత స్వామి

• వీరి పేర్ల ద్వారా వీరు వైదిక మతాభిమానులని అర్ధం అవుతుంది.


• దక్షిణ భారతదేశంలో మొట్టమొదటగా హిందూ గుహాలయాలను విష్ణుకుండినులు నిర్మించారు. హిందూ దేవాలయాలను మాత్రం మొదట ఇక్ష్వాకులు నిర్మించారు.

 శ్రీపర్వత పాదంలోని ఉమా మహేశ్వర దేవాలయం (ఆమ్రాబాద్) వీరికాలంలో శ్రీశైల దేవస్థాన ఉత్తర ద్వారంగా పేరుపొందింది.

• వీరు వైదిక మతస్థులు అయినప్పటికి ఇతర మతస్థులను ద్వేషించలేదు.



జైనమతం:

 విష్ణుకుండినుల కాలంలో శ్రీశైలం తొలుత జైన క్షేత్రంగా ఉండి, తరువాతి కాలంలో గొప్ప శైవక్షేత్రంగా మారింది.

 ఈ విషయాన్ని జైనకవి న్యాయ సేనుడు కన్నడంలో రచించిన ' ధర్మామృతం' అనే గ్రంథంలో వివరించాడు. 


బౌద్ధమతం:

• జైనమతంలో పుట్టిన కాపాలిక తెగ వల్ల జైనమతం విష్ణుకుండినుల కాలంలోనే క్షీణదశకు చేరుకుంది.

విష్ణుకుండినుల కాలానికి చెందిన ప్రముఖ బౌద్దపండితుడు - దిగ్నాగుడు

• దిగ్నాగుడి ప్రసిద్ధ సంస్కృత గ్రంథం - ప్రమాణ సముచ్చయం

 దిగ్నాగుడు బౌద్ధంలో యోగాకారవాదం (యోగాచారపంథా) ను బోధించాడు.

 తెలుగు ప్రాంతానికి చెందిన బౌద్ధ మహాపండితులలో దిగ్నాగుడు చివరివాడు.

• ఇతను వేంగి ప్రాంతంలో సాంఖ్యాకారికా రచయిత అయిన ఈశ్వర కృష్ణునితో వాగ్వాదాలు జరిపాడు.

• విష్ణుకుండినుల కాలానికి చెందిన దుగ్గిపల్లి దుగ్గన వ్రాసిన గ్రంథం - నాచికేతోపాఖ్యానం

 విష్ణుకుండినుల కాలం నాటి గొప్ప బౌద్ధ క్షేత్రం బొజ్జన్నకొండ

 వీరికాలంలో ఉద్దేశిక స్థూపం - లింగాలమెట్టు

 బౌద్ధమతాన్ని పోషించిన చివరి తెలుగు రాజులు విష్ణుకుండినులు

• క్రీ.శ 5వ శతాబ్దం చివరి నాటికి అమరావతి, నాగార్జున కొండ ప్రాంతాలలో బౌద్ధమతంలో మరో శాఖ అయిన వజ్రయానం ప్రవేశించింది.

 వజ్రయాన శాఖలోని బౌద్ధ సంఘంలోకి స్త్రీలు, మద్యమాంసాలు, మాయమంత్రాలు ప్రవేశించి క్రమక్రమంగా పవిత్రతను కోల్పోయింది.

 ఈ వజ్రయాన శాఖపల్ల బౌద్దం క్రమంగా క్షీణించి ప్రజాభిమానాన్ని కోల్పోయింది.

 తదుపరి బ్రాహ్మణులు, బుద్ధుడిని విష్ణువు యొక్క 9వ అవతారంగా చిత్రీకరించి బౌద్ధక్షేత్రాలను, వైష్ణవ క్షేత్రాలుగా మార్చారు.



వాస్తు శిల్పకళ Architecture in Vishnukundins


• విష్ణుకుండినులు నిర్మించిన ఆలయాలలో ప్రస్తుతం ఉన్న గర్భగృహం, ముఖమండపం, అర్థమండపంలు ఉండటం విశేషం.

• భువనగిరి కోటను కూడా మొదటి విష్ణుకుండినులే కట్టించినట్లు తెలిపే విష్ణుకుండినుల రాజచిహ్నం లంఘిస్తున్న సింహం శిల్పాలు ఆ కోట గోడలమీద కనిపిస్తాయి.

• విష్ణుకుండినుల కాలం నాటి బౌద్ధస్థూపాలు ఫణిగిరి, నేలకొండపల్లిలలో బయల్పడ్డాయి.

• నేలకొండపల్లిలో గల బౌద్ధస్థూపాన్ని విరాట్ స్థూపం అని పిలిచేవారు. రాను రాను విరాటరాజు గద్దెగా పిలువబడుతుంది.

• పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణం ప్రక్కన ఉన్న ఎల్.మడుగుపై ఉన్న గుహలు, గౌరీగుండం జలపాతంపై ఉన్న గుహల్లో కనిపించే మంటప స్తంభాల పై విష్ణుకుండికాలపు చైత్యాలంకరణలు (బౌద్ధ ఆరామాలు) కనిపిస్తాయి.

 ఎల్.మడుగు కింది వైపున కోమటి గుహలు సమకాలీన జైన మతస్థులకు ఆరామాలుగా మనుగడలో ఉన్నట్లు తెలుస్తుంది.

• విష్ణుకుండినుల జన్మస్థానమైన అమరావతికి సమీపంలో ఉన్న ఉమామహేశ్వరం, సల్లేశ్వరం గుహలు, ఆలంపురం శైవ-శక్తి ఆలయాలుగా వెలుగొందాయి.

• ఉమామహేశ్వరం శ్రీశైల క్షేత్రానికి ఉత్తర ద్వారా క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది,

• ఉమామహేశ్వరంలో పల్లవులు చెక్కించిన శివలింగం, విష్ణుకుండినులు చేయించిన నగారా భేరి ఇప్పటికీ ఉన్నాయి.

• సల్లేశ్వరంలో ఉన్న రెండు గుహాలయాల్లో ఒక ఆలయం గోడకు 'విశ్వేశ కక్కలస' అని రాసి ఉన్న బ్రాహ్మీ శాసనాన్ని డా॥ ద్యావనపల్లి సత్యనారాయణ గుర్తించారు.

విష్ణుకుండినుల కాలంలోని గుహలు


మొగల్రాజపురం గుహలు (కృష్ణాజిల్లా)

 • మొగల్రాజపురంలో మొత్తం 5 గుహలు కలవు 

 • 5వ గుహ అతి పెద్దది. దీనినే శివతాండవ గుహ అంటారు. ఈ గుహలో అర్థనారీశ్వర ప్రతిమ కలదు.

 • ఈ గుహలలో ఉన్న విగ్రహాలు.
       అష్టభుజ నారాయణస్వామి   త్రివిక్రమావతార మూర్తి


ఉండవల్లి గుహలు (కృష్ణాజిల్లా )

• ఇక్కడ ఉన్న 3 గుహలలో మధ్యస్థ గుహ పెద్దది 

* ఈ గుహలోనే అనంతపద్మనాభస్వామి ఆలయం కలదు 

• ఈ గుహపై ఉత్పత్తి పిడుగు అనే లేఖనం ఉంటుంది`

• ఈ గుహపైనే పూర్ణకుంభం చెక్కారు. 











Post a Comment

0 Comments