- ఇక్ష్వాకులు Ikshwaku
- ఇక్ష్వాకుల చరిత్రకు ఆధారాలు
- Evidence for the history of Ikshwaku
- ఇక్ష్వాక రాజులు - చరిత్ర
- Ikshwaku Kings-Ikshwaku History
- ఇక్ష్వాకుల పరిపాలన & వాణిజ్యం
- Administration & Commerce of the Ikshwaku
- ఇక్ష్వాకుల సాంస్కృతిక వికాసం
- Cultural development of the Ikshwaku
- ప్రముఖ బౌద్ధమతాచార్యుల రచనలు
- Works of eminent Buddhist priests in ikshwaku dynasty
ఇక్ష్వాకులు Ikshwaku
(క్రీ.శ.220-300)
After the fall of the Shatavahana Empire, the Ikshwaku declared independence in the coastal areas of Telangana.
➤ ఇక్ష్వాకులు నాగార్జునకొండ సమీపంలోని విజయపురి ని రాజధానిగా చేసుకుని కృష్ణానదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాన్ని పాలించారు.
➤ విజయపురికి మరొక పేరు శ్రీపర్వతం, కావున పురాణాలలో ఇక్ష్వాకులను శ్రీ పర్వతీయులుగా పేర్కొన్నారు.
➤ నాగార్జున కొండతో ప్రారంభించి శ్రీశైలం పర్వతం వరకుగల పర్వత పంక్తిని శ్రీపర్వతం అంటారు.
➤ శ్రీపర్వతం ప్రాచీన నామం - నల్లమల్లూరు.
➤ వీరు ఆరాధించే చిహ్నం - ఇక్షు
➤ ఇక్ష్వాకు అనే పేరు “ఇక్షు” అను పదం నుండి వచ్చింది. ఇక్షు అనగా చెరకు అని అర్థం.
➤ ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంతులు అని అల్లూరి శాసనం తెలియజేస్తుంది.
➤ ఈ అల్లూరి శాసనం ను వేయించినది - వీరపురుషదత్తుడు
ఇక్ష్వాకుల ikshwaku
• వంశ స్థాపకుడు - శ్రీశాంత మూలుడు
• రాజధాని - విజయవురి
• రాజభాష - ప్రాకృతం
• రాజలాంఛనం - సింహం
• మతం - వైదికం, బౌద్ధమతం
• ప్రసిద్ధి శిల్పం - మాందాత శిల్పం (అమరావతి శిల్పకళకు చెందినది)
• ఇక్ష్వాకులలో గొప్పవాడు - వీరపురషదత్తుడు
ఇక్ష్వాకుల జన్మ సిద్దాంతాలు: Birth theories of Ikshwaku
1. ఇక్ష్వాకులు కన్నడీగులు :
కన్నడ సిద్ధాంతం - హెగెల్, స్టెన్కోనో
2. ఇక్ష్వాకులు తమిళ ప్రాంతీయులు :
తమిళ సిద్ధాంతం - డా.కె. గోపాలాచారి
3. ఇక్ష్వాకులు ఆంధ్రప్రాంత స్థానికులు:
ఆంధ్రవాదం - బిషప్ కాల్డువేల్
4. ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశానికి చెందినవారు : రాప్సన్ & బుల్లర్
➤ విష్ణుపురాణం ప్రకారం ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశానికి చెందినవారు.
➤ బిషప్ కార్డ్ వెల్ అనే పోర్చుగీసు మత ప్రచారకుడు ద్రావిడ భాషలకు, తెలుగు భాషకు మధ్యగల సంబంధమును తులనాత్మక అధ్యయనం చేసాడు.
➤ బిషప్ కా వెల్ రాసిన గ్రంథం - “A Comparative Grammer to Dravidian Languages"
➤ ఇక్ష్వాకులు చెంచుజాతికి చెందినవారని పేర్కొన్నది - P.సుబ్రహ్మణ్యం
➤ ఇక్ష్వాకులు తాము ఇక్ష్వాకు వంశస్థుడైన శ్రీరామచంద్రుని, బుద్దుని (శాక్యముని) వంశానికి చెందిన వారమని నాగార్జున కొండ శాసనంలో ప్రకటించుకున్నారు.
➤ డా.ఆర్.జి.భండార్కర్ ప్రకారం ఇక్ష్వాకులు క్షత్రీయులు.
ఇక్ష్వాకుల చరిత్రకు ఆధారాలు
Evidence for the history of Ikshwaku
➤ ఇక్ష్వాకుల శాసనాలు నాగార్జున కొండ, జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి, ఫణిగిరిలో దొరికాయి.
➤ ఈ శాసనాలు ప్రాకృత భాషలో, బ్రాహ్మీలిపిలో రాయబడ్డాయి. శాంతమూలుడి కాలం నుండి శాసనాలు సంస్కృతం లో వేయబడ్డాయి.
➤ నాగార్జున కొండ త్రవ్వకాలలో ఇక్ష్వాకుల కాలం (క్రీ.శ. 3వ శతాబ్దం) నాటి కోట, బౌద్ధస్థూపాలు, చైత్యాలు, విహారాలు, దేవాలయాలు, స్నానఘట్టాలు మొదలగునవి ఎన్నో బయల్పడ్డాయి.
➤ మొదటిసారి నాగార్జునకొండ అవశేషాలను 1926 లో పురావస్తు శాఖలో పనిచేసే తెలుగు అసిస్టెంట్ ఎ.రంగనాథ సరస్వతి గుర్తించాడు.
➤ ఇక్ష్వాకు రాజులు తమ పేర్లకు ముందు తల్లి పేరును ధరించే సంప్రదాయాన్ని శాతవాహనుల నుండి స్వీకరించారు. ఈ సంప్రదాయం ఇక్ష్వాకులతోనే అంతమైనది.
➤ న్యాయ సేనుడు రచించిన ధర్మామృతం గ్రంథంలో శ్రీపర్వతమునకు సంభంధించిన విషయాలు ఉన్నవి.
➤ అశ్వఘోషుడు రచించిన బుద్ధ చరిత గ్రంథం ఇక్ష్వాకుల పుట్టుపూర్వోత్తరాలను గురించి తెలుపుతుంది.
ఇక్ష్వాక రాజులు - చరిత్ర
Ikshwaku Kings-Ikshwaku History
➤ ఇక్ష్వాకుల శాసనాల ప్రకారం ఇక్ష్వాక రాజుల సంఖ్య - 4
1. వాశిష్టీపుత్ర శ్రీ శాంతమూలుడు (క్రీ.శ. 220-233)
Vashishtiputra Sri Shantamulu
➤ ఇక్ష్వాకు వంశస్థాపకుడు
➤ ఇతని శాసనాలు రెంటాల, కేశనపల్లి, దాచేపల్లి వద్ద దొరికాయి.
➤ ఇతడు వైవాహిక సంబంధాల ద్వారా తన రాజ్యాన్ని విస్తరింప చేసాడు.
➤ ఇతనికి ఇద్దరు సోదరీమణులు - శాంతశ్రీ, హర్మ్యశ్రీ
➤ తన సోదరి శాంతశ్రీని పూగీయ వంశానికి చెందిన స్కంధశ్రీతో వివాహం జరిపించాడు.
➤ ఇతడు తన కుమారుడైన వీరపురుషదత్తుడికి ఉజ్జయిని పాలకుడైన రుద్రదాముడి కుమార్తె రుద్ర భట్టారిక తో వివాహం చేసాడు..
➤ ఇతను వైదిక మతాన్ని అవలంభించాడు.
➤ ఇతని ఆరాధ్య దైవం - కార్తికేయుడు. అయితే మహసేన విరూపాక్ష సుబ్రహ్మణ్యస్వామి లను కూడా పూజించేవాడు.
➤ బ్రాహ్మణులకు అనేక అగ్రహారాలను, సేద్యపు భూములను విరివిగా దానం ఇచ్చి బ్రహ్మణ మత విస్తరణకు పూనుకున్నాడు.
➤ ఇతని రెంటాల, దాచేపల్లి (ప్రాకృతం) శాసనాలలో ఇతని గురించి క్రింది విధంగా ఉంది.
• లక్షల కొలది బంగారు నాణేలు దానం చేశాడు. నేగిమాలు అనే వర్తక వ్యాపారాలను ప్రోత్సహించాడు.
• శ్రీశైలం మహాక్షేత్రానికి ఈశాన్య ద్వారం ఏలేశ్వరమును పునర్నిర్మించాడు.
• అడవులను బాగుచేసి వ్యవసాయాభివృద్ధికి కృషిచేశాడు. • ఇతను వ్యవసాయాభివృద్ధి కోసం లక్షలాది గోవులను, నాగళ్ళను, బంగారు నాణేలు, భూములను దానం చేసాడు.
➤ ఫలితంగా ఇతను పొందిన బిరుదులు :
1. శతసహస్ర హలక
2. గోశతసహస్ర
3. మహాధానపతి
4. దక్షిణపథపతి
5. అప్రతిహత శాసనుడు
➤ ఇతడు అశ్వమేథ, వాజపేయ, రాజసూయ యాగాలు,అగ్నిస్తోమ, అగ్నిహోత్ర ఇత్యాది వైదికమత క్రతువులను నిర్వహించాడు.
2.మాఠరీపుత్ర శ్రీ వీరపురుషదత్తుడు (క్రీ.శ. 233–253)
Mathariputra Sri Veerapurushadatta
➤ ఇతను ఇక్ష్వాకులు అందరిలో గొప్పవాడు
➤ ఇతని బిరుదులు దక్షిణాది అశోకుడు, ఇక్ష్వాక అశోకుడు
➤ వీరపురుష దత్తుడు మొదట వైదిక మతస్థుడు. తదుపరి ఇతని మేనత్త శాంతశ్రీ ప్రోత్సాహం మేరకు బౌద్ధమతాన్ని స్వీకరించాడు.
➤ ఇక్ష్వాకు రాజులలో బౌద్ధమతాన్ని స్వీకరించిన ఏకైక రాజు - వీరపురుషదత్తుడు
➤ ఇతను పాలనాకాలాన్ని మహాయాన బౌద్ధ చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొంటారు.
➤ ఇక్ష్వాకుల కాలంలో నాగార్జునకొండ దక్షిణగయగా ప్రసిద్ది చెందింది.
➤ ఇతని కాలంలో శ్రీపర్వత విశ్వవిద్యాలయం స్థాపించబడింది.
➤ ఇది భారతదేశంలో మొట్టమొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం.
➤ ఇతని మేనత్త శాంతశ్రీ నాగార్జున కొండవద్ద బుద్ధుడి ధాతువును నిక్షిప్తం చేసిన 'మహాచైత్యాన్ని' నిర్మించింది.
➤ బ్రాహ్మణులు, శ్రామణులు, పేద ప్రజలను కనుకరించి శాంతశ్రీ అనేక దానాలు చేసిందని నాగార్జున కొండ శాసనం తెలియజేస్తుంది.
➤ వీరపురుష దత్తుడు తన మేనత్త శాంతశ్రీ యొక్క నలుగురు కుమార్తెలను వివాహమాడాడు.
➤ ఇతని కాలం నుండే మేనత్త కుమార్తెలను వివాహమాడే సాంప్రదాయం ప్రారంభమైనది.
➤ వీరపురుషదత్తుడు శైవమతాన్ని ద్వేషించి, శివలింగాన్ని కాలితో తొక్కుతున్నట్లు చిత్రీకరించబడిన శిల్పం నాగార్జున కొండలో కలదు.
➤ నాగార్జునకొండలో ఇక్ష్వాకుల కాలం నాటి ప్రసిద్ధ బౌద్ధ శిల్పాలు బయల్పడినవి. వీటినే 'మానవీయ శిల్పాలు' అని పేర్కొంటారు.
➤ ఈ వీర పురుష దత్తుడు వేయించిన శాసనాలు:
• జగ్గయ్యపేట శాసనం
• అల్లూరి శాసనం
• నాగార్జునకొండ శాసనం
• అమరావతి శాసనం
• ఉప్పుగుండూరు శాసనం
ఉపాసిక బోధిశ్రీ
➤ వీరపురుషదత్తుడి కాలంలో బౌద్ధ మతానికి విశేష కృషి చేసిన మహిళా సన్యాసిని ఉపాసిక శ్రీ
➤ ఈమె వీరపురుషదత్తుడి రాజ్యభాండాగారికుడైన బోధిశర్మ మేనకోడలు.
➤ ఈమె శ్రీ పర్వత ప్రాంతానికి చెందిన రేవంతుడి కుమార్తె
➤ ఉపాసిక బోధిశ్రీ బౌద్ధమత సేవను వివరించిన శాసనం - ఉపాసిక శాసనం (అమరావతి)
➤ ఉపానిక భోదిశ్రీ నాగార్జునకొండ వద్ద ఉన్న చుళదమ్మగిరి అనే కొండపై బౌద్ధ ఆరామాన్ని నిర్మించినది.
➤ సింహళ విహారంలోని భోదివృక్షానికి వేదికను నిర్మించింది.
ఉపాసిక బోధిశ్రీ ఇతర నిర్మాణాలు:
• పారావత విహారమునకు ఎదురుగా శిలామండపము
• పూర్వశిల వద్ద తటాక మండపము
• దేవగిరిపై ప్రార్ధనశాలను
• కులహావిహారం వద్ద ఒక చైత్యం
• మహదమ్మగిరిపై విహారం
• పాపిల వద్ద ఏడు విహారాలను, ఇరుముత్తవ వద్ద మూడు విహారాలు నిర్మించింది.
భావవివేకుడు :
➤ వీరపురుషదత్తుడి కాలంలో నాగార్జునకొండ వద్ద నివసించిన బౌద్ధమత తార్కికుడు భావవివేకుడు
➤ భావవివేకుడు వివరించిన బౌద్ధమత సిద్ధాంతం స్వతంత్ర మాధ్యమిక వాదం, న్యాయప్రయోగ సిద్ధాంతం
➤ ఇతని రచనలు:
* తర్కజ్వాల, ప్రజాప్రదీప, కరతల రత్న
➤ భావవివేకుడి గురించి పేర్కొన్న చైనా యాత్రికుడు - హుయాన్త్సాంగ్
3. ఎహువల శాంతమూలుడు (క్రీ.శ. 253-277)
Ehuvala Shanthamula
➤ ఎహువల శాంతమూలుడి మరొక పేరు వాశిష్టీపుత్ర బాహుబల శాంతమూలుడు, రెండవ శాంతమూలుడు, వశ్మీభట్ట ఎహువల శాంతమూలుడు.
➤ తాత పేరును పెట్టుకునే సంప్రదాయం ఇక్ష్వాకుల నుండే ప్రారంభం అయినది.
➤ ఎహువల శాంతమూలుని కాలం నాటికి ప్రాకృతం స్థానంలో సంస్కృతం రాజభాషగా స్థిరపడింది.
➤ ఇతని కాలం నుండి సంస్కృతంలో శాసనాలు రాసే సాంప్రదాయం ప్రారంభం అయినది
➤ దక్షిణభారత దేశంలోనే మొట్టమొదటి సంస్కృత శాసనాలను ఎహువల శాంతమూలుడు వేయించాడు.
➤ ఇతడు నాగార్జున కొండవద్ద సంస్కృత శాసనం వేయించాడు ఇతని సంస్కృత శాసనం - గుమ్మడి గుర్రు శాసనం
➤ ఇతను వైదిక మతాన్ని అనుసరించాడు. ఇతని కాలంలో బౌద్ధమతం, హిందూ మతం రెండూ అభివృద్ధి చెందాయి.
➤ దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయ నిర్మాణమును ప్రారంభించిన మొదటి రాజు - ఎహువల శాంతమూలుడు.
➤ ఇతడు పుష్పభద్రస్వామి ఆలయాన్ని నాగార్జునకొండలో నిర్మించాడు.
➤ ఇతని కాలంలో నాగార్జున కొండలో నిర్మించబడిన ఆలయాలు :
• కార్తికేయ ఆలయం
• పుష్పభద్రస్వామి ఆలయం
• నోడిగిరీశ్వరాలయం
• హారతీ ఆలయం
• కుబేరస్వామి ఆలయం
• నవగ్రహ ఆలయం
➤ హారతి దేవాలయంలోని సప్తమాత్రుకల వద్ద ఆ కాలం నాటి స్త్రీలు సంతానం కోసం గాజులను సమర్పించేవారు.
➤ ఎహువల శాంతమూలుడి సేనాధిపతి - ఎలిశ్రీ
➤ ఎలిశ్రీ 'ఏలేశ్వరం' అనే పట్టణాన్ని నిర్మించాడు,
➤ ఈ పట్టణంలో ఎలిశ్రీ 'సర్వదేవాలయం' అనే పేరుమీద ఒక శివాలయాన్ని నిర్మించాడు.
➤ ఎహువల శాంతమూలుడి కాలంలో ఇక్ష్వాకుల రాజ్యంపై అభీర రాజ్య వసుసేనుడు దండయాత్ర చేసాడు.
➤ అభీరవసుసేనుడు విజయపురి ప్రాంతాన్ని 5 సంవత్సరాలు పరిపాలించినట్లు తెలియజేయు శాసనం - నాగార్జునకొండ శాసనం
➤ అభీర వసుసేనుడి సేనాని శివసేనుడు నాగార్జునకొండలో నిర్మించిన ఆలయం - అష్టభుజస్వామి ఆలయం
➤ ఈ అష్టభుజస్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోనే తొలి విష్ణుదేవాలయం
4. రుద్రపురుషదత్తుడు (క్రీ.శ. 283-301)
Rudrapurushadatta
➤ ఇక్ష్వాకుల చివరిరాజైన రుద్రపురుషదత్తుడిని పల్లవరాజైన సింహవర్మ ఓడించి ఇక్ష్వాక రాజ్యాన్ని ఆక్రమించాడు.
➤ పై విషయాన్ని తెలియజేయు శాసనం-మంచికల్లు శాసనం
➤ మంచికల్లు శాసనం జారీచేసినది - పల్లవ వీరకూర్చ వర్మ
➤ ఇక్ష్వాక సామ్రాజ్యాన్ని పతనం చేసినవారు-ప్రాచీన పల్లవులు
➤ ఇక్ష్వాకుల రాజ్యపతనం గురించి పేర్కొన్న మరొక శాసనం - మైదవోలు శాసనం (శివస్కంధ వర్మ)
➤ ఇక్ష్వాకుల పతనం తరువాత కృష్ణానది లోయలో ఇక్ష్వాకుల సామంతులు బృహత్పలాయనులు స్వతంత్రం ప్రకటించుకున్నారు.
ఇక్ష్వాకుల పరిపాలన & వాణిజ్యం
Administration & Commerce of the Ikshwaku
➤ ఇక్ష్వాకులు కొద్దిపాటి మార్పులతో శాతవాహనుల పరిపాలనా విధానాలనే కొనసాగించారు.
➤ ఇక్ష్వాకులు తమ రాజ్యాన్ని కొన్ని రాష్ట్రాలుగా విభజించారు.
➤ అల్లూరి, అమరావతి శాసనాలలో రఠ (రాష్ట్రం) ప్రస్తావన ఉంది.
➤ ఇక్ష్వాకుల కాలంలో 5 గ్రామాలను కలిపి గ్రామపంచక అని పిలిచేవారు.
➤ గ్రామాధికారి - తలవర
➤ ఇక్ష్వాకుల కాలంలో ప్రధానవృత్తి - వ్యవసాయం
➤ ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ మార్గం - భూమిశిస్తు
➤ భూమిశిస్తును భాగ అనేవారు, శిస్తు పంటలో 1/6వ వంతు వసూలు చేసేవారు.
➤ ధనరూపంలో వసూలుచేసే పన్ను - హిరణ్యం/దేయం
➤ ధాన్య రూపంలో వసూలు చేసే పన్ను - మేయం
➤ ఇక్ష్వాకుల కాలంలో ప్రధాన ఓడరేవు - ఘంటశాల
➤ ఇక్ష్వాకుల కాలం నాటి చేతి పరిశ్రమల గురించి తెలియజేయు శాసనం - విషవట్టి శాసనం
➤ వృత్తిపనివారు శ్రేణులుగా ఏర్పడి వ్యాపారం చేసేవారు
• పూసిక శ్రేణి - మిఠాయి వర్తక శ్రేణి
• పర్ణిక శ్రేణి - తమలపాకుల వారి శ్రేణి
➤ ఇక్ష్వాకుల కాలం నాటికి రోమ్ దేశంతో వాణిజ్యం ఉన్నత స్థితిలో జరిగింది.
➤ నాగార్జునకొండ, జగ్గయ్యపేటలలో రోమన్ బంగారు నాణేలు లభించాయి.
➤ ఈ కాలం నాటి వర్తక సంఘాలు - నేగిమాలు
➤ శాతవాహన యుగ అనంతరం నగర జీవన విధానం నశించి స్వయం పోషకమై, పరిమితమైన బాహ్య సంబంధాలు గల స్తబ్దమైన గ్రామీణ జీవన విధానం పెరిగింది.
ఇక్ష్వాకుల సాంస్కృతిక వికాసం
Cultural development of the Ikshwaku
➤ ఇక్వాకుల కాలంలో మత, సాహిత్య, వాస్తు, కళారంగాలు గణనీయమైన ప్రగతిని సాధించాయి.
➤ ఇక్ష్వాకు రాజులలో వీరపురుషదత్తుడు తప్ప, మిగిలిన ముగ్గురు రాజులు వైదికమతాన్ని అవలంభించారు.
➤ ఇక్ష్వాకుల అధికార మతం - శైవమతం.
➤ అయితే వీరు బౌద్ధమతంను కూడా ఆదరించారు
➤ వీరపురుష దత్తుడి కాలంలో ఆంధ్రలో బౌద్ధమతం వ్యాప్తి జరిగింది.
➤ వీరపురుషదత్తుడి సోదరి అడవి శాంతిశ్రీ నాగార్జున కొండవద్ద బౌద్ధ ఆరామవిరామంను బౌద్ధ భిక్షువులకు దానం చేసింది.
➤ వీరపురుషదత్తుడి కుమార్తె కొడబలిసిరి నాగార్జునకొండ వద్ద ఒక బౌద్ధ విహారాన్ని నిర్మించినది.
➤ బౌద్ధమతంలోని పూర్వశైలీయులకు - అమరావతి, అపరశైలీయులకు నాగార్జునకొండ ప్రధాన కేంద్రంగా ఉండేవి.
➤ బౌద్ధ గ్రంథాలలోని నిఖయలను మంత్రాల రూపంలో చదివే పద్దతి మొట్టమొదటిసారి ప్రారంభమైంది.
➤ బౌద్ధ స్థూపాల నిర్మాణంలో కోరికలు తీరినందుకు గాను కట్ట బడే 'ముడువు స్థూవముల' నిర్మాణాలు ప్రారంభమయ్యాయి.
నోట్: 2015 జనవరిలో సూర్యాపేట జిల్లా ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో క్రీ.శ 3వ శతాబ్దం నాటి మహాస్థూపం వద్ద రాగి, సీసంతో తయారైన ధాతుపాత్ర లభించింది.
➤ 2015 జూన్ లో కరీంనగర్ జిల్లా సింగరాయలొద్ది లో నాలుగు తలలున్న బుద్ధ విగ్రహాన్ని వెలికితీసారు.
➤ ఆచార్య నాగార్జునుడి శిష్యుడు ఆర్యదేవుడు రచించిన గ్రంథం - చిత్తశుద్ధి ప్రకరణం
➤ ప్రాకృతం ఇక్ష్వాకుల రాజభాష అయినప్పటికీ సంస్కృతం మంచి ఆదరణ, అభివృద్ధిని సాధించింది.
శిల్పకళ
Ikshwaku Sculpture
➤ ఇక్ష్వాకుల కాలంలో అమరావతి శిల్పకళకు నాగార్జునకొండ ప్రధాన కేంద్రంగా ఉంది.
➤ ఈ కాలంలో శిల్పాల నిర్మాణం మహాయాన బౌద్ధంను అనుసరించి జరిగింది,
➤ అమరావతి శిల్పాలలో సతీసహగమనం మొదటిసారిగా కనిపిస్తుంది.
మాందాత శిల్పం
➤ ఇక్ష్వాకుల కాలం నాటి అతిముఖ్యమైన శిల్పం - మాందాత శిల్పం
➤ ఈ శిల్పం జగ్గయ్యపేటలో కనుగొన్నారు.
➤ చక్రవరి ఏ విధంగా ఉంటాడో మొట్టమొదటిసారి మాందాత శిల్పంలో చూపించారు.
➤ శాసనాలపై సంవత్సరాలను, తారీఖు, తిథిలను ప్రస్తావించే ఆచారం ఇక్ష్వాకుల కాలం నుండే ప్రారంభమైనది.
➤ దేవాలయాలపై, శిల్పాలపై శిల్పి పేరు లిఖించే సంప్రదాయం ఈ యుగంలోనే ప్రారంభమైనది.
➤ నాగార్జునకొండలోని బౌద్ధ విహారములను నిర్మించిన శిల్పిగా “బదంతాచార్య' యొక్క పేరు చెక్కబడినది.
➤ ఇక్ష్వాకుల కాలంలో ధాన్యకటకం (అమరావతి), నాగార్జునకొండల్లోని విశ్వవిద్యాలయాలు ప్రసిద్ధిగాంచాయి
➤ క్రీ.శ. రెండో శతాబ్దం నాటికి నాగార్జునకొండ భారతదేశంలోనే ప్రసిద్ధ బౌద్ధ ఆరామంగా విలసిల్లింది.
➤ ఇక్ష్వాకుల కాలంలో నాగార్జున కొండ వద్ద నిర్మించిన ప్రఖ్యాత నిర్మాణం - ధ్వని విజ్ఞాన కేంద్రం (ప్రేక్షాగారం)
➤ ఇక్ష్వాకుల కాలంలో నిర్మించబడ్డ అతి ముఖ్యమైన స్థూపం - నేలకొండపల్లిలో ఉంది.
➤ నేలకొండపల్లి త్రవ్వకాలలో ఇక్ష్వాకుల కాలం నాటి బుద్ధుని కంచు విగ్రహం, పాలరాయిపై చెక్కిన తొమ్మిది బుద్ధ విగ్రహాలు బయల్పడ్డాయి.
➤ గాజులబండలో సున్నపురాయితో చేసిన రెండు సింహాల బొమ్మలు, బౌద్ధ స్థూపం దొరికాయి
ఇక్ష్వాకుల ఇతర ముఖ్య నిర్మాణాలు
• ఏలేశ్వరంలో సర్వదేవాలయం
• చేజర్ల సప్తమాతృకల విగ్రహాలు
• వీరాపురం దేవాలయం
• కొణిదెన, పెద్ద ముడియం శిల్పఫలకాలు
➤ వీరుల విగ్రహాలను ప్రతిష్ఠించే విరాగల్ అనే సాంప్రదాయం ఇక్ష్వాకుల కాలం నుండే ప్రారంభమైంది.
ప్రముఖ బౌద్ధమతాచార్యుల రచనలు
Works of eminent Buddhist priests in ikshwaku dynasty
బుద్ధఘోషుడు (5వ శతాబ్దం)
➤ ఇతను బౌద్ధమతంలోని హీనాయాన శాఖను ప్రచారం చేశాడు.
➤ ఇతను నాగార్జునకొండలోని సింహళ విహారంలో నివసించాడు.
➤ ఇతను బౌద్ధమత గ్రంథాలపై త్రిపీఠకాల పై వ్యాఖ్యానాలు రాశాడు. వీటినే 'విసుద్ధిమగ్గ / విభాష' అంటారు,
బుద్ధపాలిత (5, 6వ శతాబ్దం)
➤ బౌద్ధంలో 'ప్రసాంగిక మాధ్యమిక వాదం' రూపకర్త
మైత్రేయనాథుడు
➤ బౌద్ధంలో 'యోగాకారతత్వం'ను ప్రారంభించిన మైత్రేయనాథుడు.
దిగ్నాగుడు (5వ శతాబ్దం)
➤ ఆ ఇతనిని 'భారత తర్కశాస్త్ర పితామహుడు' అంటారు. .
ఇతని రచనలు :
• ప్రమాణ సముచ్ఛయ
• న్యాయప్రవేశ
• హేతుచక్ర ధమరు
ధర్మకీర్తి (6,7వ శతాబ్దం)
➤ ఇతనిని 'కాంట్ ఆఫ్ ఇండియా' గా పిలుస్తారు.
రచనలు:
• ప్రమాణవార్తిక
• న్యాయబిందు
• హేతుబిందు
శాతవాహన పూర్వ యుగం ఆర్టికల్ కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి
శాతవాహన యుగం ఆర్టికల్ కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి
0 Comments